తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని అంటారు. ఇది ఓ జంట విషయంలో నిజమైంది. వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు చెబితే పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇంతలో విధి వారి పాలిట శాపమైంది. రెండు నెలల వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మరణించడం విషాదంగా మారింది.
నెల్లూరు జిల్లా రావూరు మండలం మిట్టపల్లి మండలానికి కు చెందిన శిరీష నగరంలోని జీజీహెచ్ లో కాంట్రాక్ట్ నర్సుగా విధులు నిర్వహిస్తుంది. గూడూరు అయ్యవారి పాళేనికి చెందిన జగదీశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవల ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
డిసెంబర్ లో జగదీశ్ గుండెపోటుతో మరణించాడు. ఆనాటి నుంచి శిరీష తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి అర్థాంతరంగా వదిలివెళ్లిపోవడం, అటు కుటుంబ సభ్యుల ఆదరణ కూడా లేకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇటీవల తన స్నేహితురాలు రమాదేవికి తన ఇంటికి పిలిపించుకుని ఉంటుంది. ఈ నెల 7వ తేదీన శిరీష కళ్ళు తిరుగుతున్నాయని స్నేహితురాలికి చెప్పింది.
వెంటనే జీజీహెచ్ కు తరలించగా అప్పటికే శిరీష మరణించినట్టుగా నిర్దారించారు. శిరీష చేతిపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.