గోధుమ గడ్డి జ్యూస్ ను రోజా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. అందుకే ఇళ్లలోనే ఈ గడ్డిని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. మరి ఈ గడ్డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం..
ముందుగా గోధుమ గడ్డిలో ఉండే ఔషద గుణాలు పరిశీలిస్తే.. ఇందులో క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయాన్నే 30 ఎంఎల్ మోతాదులో ఈ జ్యూస్ ను తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వైద్యుల అవసరం లేకుండానే పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా పైల్స్ వ్యాధితో బాధపడేవారికి ఇది దివ్య ఔషధంగా చెప్పవచ్చు.
ఈ జ్యూస్ వల్ల అజీర్థం, మలబద్ధకం, అసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉండటం వల్ల శరీరంలోని వాపును తగ్గిస్తుంది. అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులను అరికడుతుంది. ఫైబర్ కారణంగా ప్రేగుల్లో పేరుకున్న మలినాలను ఇది తొలగిస్తుంది. అల్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొత్త రక్తాన్ని అందిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ ను కణాలు ఎక్కువగా గ్రహించుకుంటాయి.
అందువల్ల ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఈ జ్యూస్ ను తాగాలి. గోధుమ గడ్డికి సంబందించిన పొడులు, ట్యాబ్లేట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయుర్వేదం మాత్రం ఫ్రెష్ జ్యూస్ ను తీసుకోవడమే మంచిదని సూచిస్తుంది. గోధుమ గడ్డిని ఎవరైనా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు.
చర్మంపై పై ముడతలు పడకుండా ఉండేందుకు, కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలను తొలగించుకోవడానికి కూడా ఈ జ్యూస్ వాడతారు. అందుకే ఎన్నో కాస్మెటిక్స్ ప్రాడక్ట్స్ లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవాళ్ళలో రక్త హీనత సమస్యను తొలగిస్తుంది.