తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా లేఖను పంపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని ఆయన పేర్కొన్నారు. ఉక్కు ఫ్యాక్టీరి రక్షించుకునేందుకు తాను నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
కాగా, గత కొంత కాలంగా ఆయన రాజకీయాల్లో యాక్టీవ్గా లేరు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సైతం గంటా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకానొక సమయంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ, ఇంతకాలం సైలెంట్గా ఉన్న గంటా ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక నుంచి ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమలో చురుగ్గా పాల్గొననున్నారు.