అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు మరోసారి ఉచ్చు బిగుస్తుంది. గతేడాది కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేరళ ఐటీ శాఖ లో పనిచేసే స్వప్న సురేష్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
స్మగ్లింగ్ కేసు విచారణ సందర్భంగా ఆమె విజయన్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. కాగా సీఎంతో పాటుగా స్పీకర్, మరో మంత్రి కూడా ఈ స్మగ్లింగ్ లో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలిపింది. కాన్సులేట్ తో ఆయన నేరుగా సంభాణలు జరిపేవారని విజయన్ కు అరబిక్ బాష మాట్లాడటం, అర్థం చేసుకోవడం రాని కారణంగా వీరికి మధ్యవర్తిగా తాను వ్యవహరించినట్టుగా తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఎంతో పాటుగా పలువురు మంత్రులు భారీగా కమిషన్ పొందారని వెల్లడించి షాకిచ్చింది.
కాగా స్వప్న సురేష్ తెలిపిన వివరాలను కస్టమ్స్ అధికారులు హై కోర్టుకు నివేదిక రూపంలో అందించారు. 2020 జులై 5న లో తిరుఅనతపురంలోని యూఏఈ కార్యాలయానికి వస్తున్న అరబ్ ఎమిరేట్స్ లో భారీగా 30 కిలోల బంగారంతో ఉన్న పార్సిల్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 15 కోట్లు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోసంచలనం సృష్టించింది. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటుగా కేరళ ఐటీ శాఖలో పని చేస్తున్న స్వప్న సురేష్ ను ఎంఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం విజయన్ కార్యాలయ ఉద్యోగి కూడా ఈ కేసులో ఆరోపణలుఎదుర్కున్నారు.