తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు కొనియాడారు. ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. కాగా చంద్రబాబు తీరుపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి విరుచుకుపడ్డారు.
”పార్టీ పెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అశోక్ గజపతి రాజు గారు ఒకరు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది” అంటూ ఆమె ఆనాటి ఒక లేఖను బయటపెట్టారు.
ఆ లేఖలో మొత్తం ఐదుగురి తెలుగు దేశం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, ఆశోక్ గజపతి రాజు, విధ్యాదర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవ రెడ్డిలను పార్టీనుంచి తొలగించాలని స్పీఎకర్ కు లేఖ రాశారు.