తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలేం జరిగిందంటే… నిన్న విశాఖపట్నంలో మూడు రాజధానులకు అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలను నిలువరించే క్రమంలో ఇన్స్పెక్టర్ కింద పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు అధికారిని పైకి లేపి సహాయం చేశారు. కానీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో సీఐపై వైసీపీ నేతలు దాడి చేశారని వార్తలు ప్రసారం చేశారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు… దాడి ఫోటో చూసి తాను షాక్కు గురయ్యానని, వైసీపీ గుండాలు పోలీసులపైనే దాడికి తెగబడే స్థాయికి వెళ్లారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు కూడా భద్రత లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఐ తలపై ఒక వైసీపీ నాయకుడు చేయి వేసిన ఫోటోను చంద్రబాబు పోస్ట్ చేశారు.
చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఈ ఘటనపై తప్పుడు వార్తను పోస్ట్ చేయడంతో ఏపీ పోలీసులు వెంటనే స్పందించారు. అసలు సీఐపై ఎవరూ దాడి చేయలేదని, కిందపడిన సీఐకి వైసీపీ నాయకులు సాయం చేశారని పోలీసులు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి మిగతా ఫోటోలను సైతం ఆధారాలుగా పోస్ట్ చేశారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని పోలీసులు కోరారు. ఇదే విషయమై ఏసీపీ మూర్తి విశాఖలో మాట్లాడుతూ.. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna’s office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn’t safe in Andhra Pradesh anymore. pic.twitter.com/Bp4RJgrQSf
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 18, 2020
#FactCheck: Respected Leader of Opposition party. @ncbn Sir your post is NOT Correct. The allegations are FALSE again. The YSRCP cadre was only helping Officer and massaging his injury after a fall. (1/3)@governorap @AndhraPradeshCM @AndhraPradeshHM @barandbench @naralokesh pic.twitter.com/9Ow4QrqJoM
— Andhra Pradesh Police (@APPOLICE100) December 18, 2020