బంగారం ధరలు మరోసారి అంచనాలు తప్పాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారంతా పెట్టుబడులు వెనక్కి తీసుకుని బంగారం పై ఇన్వెస్ట్ చేస్తారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషించారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనించింది. ఆ ప్రభావంతో బంగారం ధరలు పడిపోయాయి. తాజాగా సోమవారం రోజున అంటే మార్చి 22వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తాజాగా హైరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,230 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,223 గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 46,070 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,607 గా ఉంది. విజయవాడ, విశాఖలోని ఇవే ధరలు ఉన్నాయి..
బంగారం ధరలు పడిపోతే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,800 గా ఉండగా తులం వెండి ధర రూ. 718 గా ఉంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు దారులు బంగారం కొనేముందు మరొక్కసారి బంగారం ధరలను పరిశీలించుకోవడం మంచిది.