దిగొస్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ధరలు స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. మార్చి 25 వ తేదీన అంటే గురువారం నాటి మార్కెట్ ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. రూ.41,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,190గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరలో కూడా మార్పులేదు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. ఒక్క గ్రాము మేలిమి బంగారం ధర రూ.4,570గా ఉంది.
హైద్రాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ. 300 పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ. 700 గా ఉంది.