యూజర్లకు టెలికం దిగ్గజ సంస్థ జియో కొత్త సంవత్సరం సందర్భంగా శుభవార్త వినిపించింది. ట్రాయ్ సూచనల మేరకు దేశీయంగా వాయిస్ కాల్స్ పై ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలు ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఇప్పటివరకు జియో సిమ్ నుంచి ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ తదితర సిమ్ లకు కాల్ చేయాలంటే చార్జీ చెల్లించవలసి వచ్చేది. తాజాగా ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. . ఇకపై జియో నుంచి జియోకు మాత్రమే కాకుండా, దేశీయంగా అన్ని ఇతర కంపెనీల నెట్వర్క్ లకు కూడా ఉచితంగా కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. యూజర్లు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ ను చేసుకోవచ్చు. ఇకపై భారత్ ఫ్రీ వాయిస్ కాల్స్ దేశంగా మారుతుందని జియో పేర్కొంది.