తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా మెట్రో పాలిటన్ రీజియన్ ( ఏఎమ్మార్డీయే) అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
అమరావతి లో ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణం, వాటి పురోగతి, అభివృద్ధి తదితర అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్బీసిసి, ఏపీఐఐసి నివేదికలను అందించాయి. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విభజించే ప్రతిపాదనపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణతో పాటుగా రూ. 1,450 కోట్ల ఆదాయం వస్తుందని తమ నివేదికలో వెల్లడించాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ. 150 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అమరావతి అభివృధికి కరకట్ట రోడ్డు కీలకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విశాఖ తీరంలో 13.59 ఎకరాల స్థలంలో పాజెక్టు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.